విశాఖలో పుర్రెతో కలకలం రేపిన సైకో

విశాఖపట్టణంలో ఓ సైకో హల్‌చల్‌ చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటోన్న ఆ సైకో ఆదివారం మనిషి తలను సంచిలో పెట్టుకొని ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లాడు.

విశాఖలో పుర్రెతో కలకలం రేపిన సైకో
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 11:34 AM

Psycho in Visakhapatnam: విశాఖపట్టణంలో ఓ సైకో హల్‌చల్‌ చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటోన్న ఆ సైకో ఆదివారం మనిషి తలను సంచిలో పెట్టుకొని ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ తలను కాల్చుకొని తింటుండగా స్థానికులు గమనించి అక్కడ గుమిగూడారు. దాంతో ఆ పుర్రెను అక్కడే వదిలేసి సైకో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతడు తీసుకొచ్చిన తల ఎవరిది..? ఎవరినైనా హత్య చేసి దాన్ని తీసుకొచ్చాడా..? లేదంటే స్మశానంలో శవం తలను తీసుకొచ్చాడా..? అన్న కోణంలో వారు విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో సమీపంలోని వార భయాందోళనకు గురయ్యారు.

Read More:

ధోనిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్‌

నీ వలనే కోలుకున్నా.. ప్లాస్మా డోనర్‌ కాళ్లు కడిగిన డిప్యూటీ స్పీకర్