ప్రభు..నయన్ కలిసి నటించటం లేదు…

ప్రభుదేవా..నయనతారతో కోసం నటిస్తున్నారని వస్తున్న వార్తలకు బ్రేక్ వేశారు నిర్మాత ఈశ్వరీ కె. గణేశ్. ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మాతగా వస్తున్న ‘కరుప్పు రాజా వెలై రాజా’ అనే సినిమా కొన్నేళ్ల కిందట మొదలైంది. విశాల్‌, కార్తీ ప్రధాన పాత్రల్లో కొంత షూటింగ్‌ జరుపుకుంది. అయితే కొన్ని కారణాలతో అది రెండేళ్ల క్రితం నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా ఆ సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఇందులో డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా, నయనతార […]

ప్రభు..నయన్ కలిసి నటించటం లేదు...
Follow us

|

Updated on: Jun 04, 2020 | 2:27 PM

ప్రభుదేవా..నయనతారతో కోసం నటిస్తున్నారని వస్తున్న వార్తలకు బ్రేక్ వేశారు నిర్మాత ఈశ్వరీ కె. గణేశ్. ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మాతగా వస్తున్న ‘కరుప్పు రాజా వెలై రాజా’ అనే సినిమా కొన్నేళ్ల కిందట మొదలైంది. విశాల్‌, కార్తీ ప్రధాన పాత్రల్లో కొంత షూటింగ్‌ జరుపుకుంది. అయితే కొన్ని కారణాలతో అది రెండేళ్ల క్రితం నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా ఆ సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఇందులో డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా, నయనతార కలిసి నటించనున్నారంటూ పుకార్లు తెగ షికారు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన నిర్మాత ఈశ్వరీ కె. గణేశ్… ఈ వైరల్ న్యూస్‌కు కత్తర పెట్టారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. అంతే కాదు.. ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశం నాకు లేదు.. అని ఈశ్వరీ తేల్చి చెప్పారు.  దీంతో మాజీ ప్రేమికుల సినిమా కథ ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది.

లేడీ సూపర్ స్టార్ అవతరించిన నయనతార పట్టిందల్లా బంగారంగా మారుతోంది. లాక్‌డౌన్‌కు ముందు దర్బార్ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన మెరిసిన నయన్… ఇప్పుడు మరో చిత్రం కోసం చూస్తోంది. ఇదే సమయంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి నటిస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. ఆ చిత్ర నిర్మాణంపై ఈశ్వరీ కె. గణేశ్ ఇచ్చిన క్లారిటీతో బ్రేక్ పడింది.