సీఎల్పీ మీటింగ్‌కు రావాల్సిందే..! కాంగ్రెస్ విప్ జారీ

| Edited By:

Jul 07, 2019 | 7:33 PM

కర్ణాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. పార్టీ నాయకత్వానికి తెలియజేయకుండా.. నేరుగా రాజీనామాలతో స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తున్న అసంతృప్త నేతలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల తాజా రాజీనామాలతో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. వారితో సంప్రందించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. మంగళవారం జరిగే సీఎల్‌పీ సమావేశానికి […]

సీఎల్పీ మీటింగ్‌కు రావాల్సిందే..! కాంగ్రెస్ విప్ జారీ
Follow us on

కర్ణాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. పార్టీ నాయకత్వానికి తెలియజేయకుండా.. నేరుగా రాజీనామాలతో స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తున్న అసంతృప్త నేతలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల తాజా రాజీనామాలతో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. వారితో సంప్రందించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది.

మంగళవారం జరిగే సీఎల్‌పీ సమావేశానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. లేని పక్షంలో గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. సీఎల్‌పీ సమావేశానికి కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు కూడా హాజరవుతారని తెలిపింది.