కర్ణాటకలో ప్రచారానికి చంద్రబాబును ఆహ్వానించిన దేవెగౌడ

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ప్రధాని దేవెగౌడ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికలు జరిగిన తీరు… ఈవీఎంల మొరాయింపుపై ఆరా తీశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆయనతో.. మాజీ ప్రధాని దేవెగౌడ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి […]

కర్ణాటకలో ప్రచారానికి చంద్రబాబును ఆహ్వానించిన దేవెగౌడ
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 9:38 PM

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ప్రధాని దేవెగౌడ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికలు జరిగిన తీరు… ఈవీఎంల మొరాయింపుపై ఆరా తీశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆయనతో.. మాజీ ప్రధాని దేవెగౌడ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఫోన్​లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. ఈవీఎంల మొరాయింపు, నాయకుల మధ్య ఘర్షణల వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు.. తెదేపా తరపున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ… కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ జేడీ(ఎస్) తరపున ఎన్నికల ప్రచారానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.