అద్దె కట్టమంటున్నారా.. అయితే జైలుకే..!
కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. చేసేందుకు పని లేక ఇల్లు కదలలేక పూట గడవని పరిస్థితి. మరోవైపు ఇంటి అద్దెలు కట్టాలంటూ వేధించేవారిపై కఠినచర్యలు తప్పవంటున్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అద్దె కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు కాలేజీకి దగ్గర్లో ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. […]
కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. చేసేందుకు పని లేక ఇల్లు కదలలేక పూట గడవని పరిస్థితి. మరోవైపు ఇంటి అద్దెలు కట్టాలంటూ వేధించేవారిపై కఠినచర్యలు తప్పవంటున్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అద్దె కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు కాలేజీకి దగ్గర్లో ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అద్దె కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొమ్మిది మంది ఇంటి యజమానులపై కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 188 కింద ఇంటి యజమానులపై కేసు నమోదు చేశారు. దీంతో వారికి ఒక నెల జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇక అటు దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోనూ సేమ్ సీన్. కోట్ల ముబారక్పూర్లో అద్దె చెల్లించలేదని.. విద్యుత్ కనెక్షన్లను తీసేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా..ఇరు వర్గాల మధ్య పరిష్కారం కుదరడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు.
నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఒత్తిడి చేసినా, ఇంటి నుంచి బయటకు పంపినా హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు ఢిల్లీ పోలీసులు.