పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కన్ఫామ్ అయింది. ఈ కాంబో పై కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Aug 29, 2020 | 9:55 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కన్ఫామ్ అయింది. ఈ కాంబో పై కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వ‌క్కంతం వంశీ ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ స్టోరీ సిద్ధం చేసిన‌ట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం కాంబినేషన్లో ఇంతకుముందు మంచి సినిమాలే వచ్చాయి. కిక్‌, రేసుగుర్రం వంటి సూప‌ర్ హిట్ మూవీలకు వ‌క్కంతంనే క‌థ అందించాడు. ఇక పవన్, సురేందర్ రెడ్డి సినిమాకి రామ్ తాళ్లూరి నిర్మాత‌. సురేంద‌ర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ కథలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక ప‌వ‌న్ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. అటు, పవన్ షెడ్యూల్ కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వ‌కీల్ సాబ్‌, హ‌రీష్ శంక‌ర్ సినిమాల తర్వాత సురేంద‌ర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.