అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్పై నిందలు వేసిన పాక్
ది హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్పై పాకిస్థాన్ నిందలు వేసింది. 2014లో జరిగిన పెషావర్ ఉగ్రదాడిలో భారత హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. సైనిక పాఠశాలపై జరిగిన ఆ ఉగ్రదాడి కారణంగా తాము 140 మంది చిన్నారులను కోల్పోయామని, ఈ దాడికి భారత్ స్పాన్సర్ చేసిందని వాదించింది. కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది. పాక్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ […]
ది హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్పై పాకిస్థాన్ నిందలు వేసింది. 2014లో జరిగిన పెషావర్ ఉగ్రదాడిలో భారత హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. సైనిక పాఠశాలపై జరిగిన ఆ ఉగ్రదాడి కారణంగా తాము 140 మంది చిన్నారులను కోల్పోయామని, ఈ దాడికి భారత్ స్పాన్సర్ చేసిందని వాదించింది. కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది.
పాక్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ కౌన్సిల్ తన వాదనలు వినిపించింది. కుల్భూషణ్ జాదవ్తో బలూచిస్థాన్లో దాడులు చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నించింది. జాదవ్ రా అధికారి. విచారణలో ఈ విషయాన్ని జాదవ్ స్వయంగా ఒప్పుకొన్నాడు.
ఆత్మాహుతి దాడులు జరిపి పాక్లో గందరగోళం సృష్టించేందుకు జాదవ్ అనేక మందిని కలిశాడు. అజిత్ దోవల్ మార్గ నిర్దేశకత్వంలోనే జాదవ్ ఈ పనులన్నీ చేశాడు. జాదవ్ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశామని భారత్ చెప్పడం హాస్యాస్పదం. భారత్ నిజాన్ని దాచాలని చూస్తోంది’ అని పాకిస్థాన్ కౌన్సిల్ ఆరోపించింది.