Breaking :తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..
కరోనా మహమ్మారి తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు కలవరపెడుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కోవిడ్-19 బారినపడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్కు కరోనా సోకినట్లుగా డాక్టర్లు నిర్దారించారు.
కరోనా మహమ్మారి తెలంగాణలో ప్రజా ప్రతినిధులను కలవరపెడుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కోవిడ్-19 బారినపడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్కు కరోనా సోకినట్లుగా డాక్టర్లు నిర్దారించారు. దీంతో ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్-19 బారిన పడ్డట్లుగా అయింది. నిన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకుంది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ విజి గౌడ్ వెంటనే 14 రోజుల హోం క్వరంటెన్ లోకి వెళ్లారు.