MP Ganesh Murthy: లోక్సభ ఎన్నికలకు టికెట్ రాలేదని సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఆత్మహత్య..!
కొద్దిరోజుల క్రితం తన నివాసంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈరోజు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ప్రస్తుత లోక్సభ ఎంపీ, MDMKకి చెందిన ఎ. గణేష్మూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం తన నివాసంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈరోజు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ప్రస్తుత లోక్సభ ఎంపీ, MDMKకి చెందిన ఎ. గణేష్మూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గురువారం ఉదయం 5:05 గంటలకు గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎండిఎంకెకు చెందిన గణేష్ మూర్తి ఈరోడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఈసారి ఈరోడ్ నియోజకవర్గాన్ని డీఎంకే కైవసం చేసుకుంది. దీంతో గణేశమూర్తికి అవకాశం ఇవ్వలేదు. దీంతో డిప్రెషన్లో ఉన్నాడని అంటున్నారు. మార్చి 24 న లోక్సభ ఎన్నికలకు టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ మూర్తి తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు కుటుంబసభ్యులు. కాగా, అతను చికిత్స పొందుతుండగా ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
#UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2
— ANI (@ANI) March 28, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…