PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. అన్నదాతలకు ఎంతో లాభాన్ని సమకూర్చే 109 రకాల వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ICAR) లో ఈ కార్యక్రమం జరిగింది.

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..
Pm Modi
Follow us

|

Updated on: Aug 12, 2024 | 11:49 AM

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. అన్నదాతలకు ఎంతో లాభాన్ని సమకూర్చే 109 రకాల వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ICAR) లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో భేటీ అయ్యారు. మోదీ మాట్లాడుతూ.. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా 109 రకాల పంటల వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త విత్తనాలను విడుదల చేసినట్లు తెలిపారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై తన ప్రాధాన్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం “జై జవాన్, జై కిసాన్”.. తోపాటు అటల్ వాజ్‌పేయ్ నినాదం “జై విజ్ఞాన్” అనే నినాదాన్ని ఆయన గుర్తు చేశారు. పరిశోధన, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ఈ పదబంధానికి “జై అనుసంధన్” కూడా జోడించాలని సూచించారు. కాగా.. రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్రొటోకాల్ ను పక్కనబెట్టి..

కాగా.. రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పూసా ఇవెంట్‌లో రైతులతో మాట్లాడేందుకు ప్రధాని వెళ్లినప్పుడు, భారీ వర్షం కురిసింది. ఇంటరాక్షన్‌ను రద్దు చేయాలని అధికారులు ప్రధానిని కోరారు.. అయితే వర్షం ఉన్నప్పటికీ రైతులతో సంభాషిస్తానని ప్రధాని పట్టుబట్టారు. ఇక.. గొడుగు పట్టుకునే విషయానికి వస్తే.. ప్రధాని తన గొడుగును తానే పట్టుకుంటానని సెక్యూరిటీకి చెప్పారు. అంతేకాకుండా రైతులకు కూడా గొడుగు పట్టేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. కఠినమైన ప్రొటోకాల్ ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ రైతులతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం పట్ల పలువురు ఆయన సింప్లిసిటీని అభినందిస్తున్నారు.

వీడియో చూడండి..

వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో అధిక దిగుబడినిచ్చే, రకరకాల వాతావరణల పరిస్థితిని తట్టుకునేలా ఈ బయోఫోర్డిఫైడ్ విత్తనాలను తయారు చేశారు. 109 రకాల వంగడాలలో 61 పంటల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ విత్తనాల్లో.. పొలాల్లో పండే పంటల విషయానికొస్తే.. మినుము, నూనెగింజలు, చిక్కుడు, చెరకు, పత్తి సహా ఇతర పంటలు ఉన్నాయి. అలాగే ఉద్యాన పంటల విషయానికొస్తే, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ పంటలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతులతో పాటు శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

పోషకాహార లోపం లేని భారతదేశాన్ని రూపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా బయో ఫోర్టిఫైడ్ రకాల పంటలను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. చిరుధాన్యాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మోదీ వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిందని, ప్రజలు అటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శాన్‌ఫ్రాన్సిస్కో టూర్‌లో డ్రైవర్‌లెస్‌ కార్ ఎక్కిన సీఎం
శాన్‌ఫ్రాన్సిస్కో టూర్‌లో డ్రైవర్‌లెస్‌ కార్ ఎక్కిన సీఎం
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!