Lakshadweep: లక్షద్వీప్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. బడ్జెట్లో ప్రత్యేకంగా..
మాల్దీవులకు ఒక్కసారిగా పర్యాటకులు తగ్గిపోయారు. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతలా అంటే అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న భారత్ ఒకేసారి 5వ స్థానంలోకి పడిపోయింది. లక్షద్వీప్కు ఒక్కసారిగా బుకింగ్స్ పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బడ్జెట్...
ఈ ఏడాది మొదట్లో లక్షద్వీప్ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటనపై మాల్దీవుల మంత్రులు విషం చిమ్మారు. ప్రధాని మోదీతో పాటు భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇదికాస్త ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఈ కారణంతో మాల్దీవుల పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే.
మాల్దీవులకు ఒక్కసారిగా పర్యాటకులు తగ్గిపోయారు. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతలా అంటే అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న భారత్ ఒకేసారి 5వ స్థానంలోకి పడిపోయింది. లక్షద్వీప్కు ఒక్కసారిగా బుకింగ్స్ పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బడ్జెట్ సమావేశాల్లో లక్షద్వీప్ అంశం తెరపైకి వచ్చింది. లక్షద్వీప్ అభివృద్ధి కోసం బడ్జెట్లో కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు.
లక్షద్వీప్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ పర్యటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. పర్యటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్న ఆర్థిక మంత్రి.. భారత్లోని 60 చోట్ల నిర్వహించిన జీ20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యటకులకు తెలియజేశాయన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు కొత్త ప్రాంతాలను అన్వేషించాలనే ఉత్సాహంతో ఉన్నారని, ఆధ్యాత్మిక పర్యటకం కారణంగా స్థానిక వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఇక ఆకర్షణీయమైన ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని తెలిపిన నిర్మలా సీతారామణ్.. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామని తెలిపారు. వసతులు, నాణ్యమైన సేవలు ఆధారంగా ఈ పర్యటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఒక ఫ్రేమ్ వర్క్ను సిద్ధం చేస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..