Monkeypox: భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు..

మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపిన మంకీపాక్స్ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది.

Monkeypox: భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు..
Monkeypox
Follow us

|

Updated on: Sep 09, 2024 | 7:26 PM

మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపిన మంకీపాక్స్ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉనికిని నిర్ధారించిందని తెలిపింది.

ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకుముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు పేర్కొంది.. ఈ కేసు మునుపటి 30 కేసుల మాదిరిగానే ఇదికూడా ఒకటని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

సోకిన వ్యక్తి , Mpox తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవల ప్రయాణించిన ఒక యువకుడని పేర్కొంది.. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ సదుపాయంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

మంకీపాక్స్  కేసు నమోదు కావడంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టులు, రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలిచ్చింది. అలాగే మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్‌, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అప్రమత్తం చేసింది..