ముంబై సిటీని వీడాలనుకుంటున్నారా ? అయితే మీకోసం….

మహారాష్ట్రలో 11 కరోనా వైరస్ రెడ్ జోన్స్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ముంబై నగరం కూడా ఉంది. దేశంలో.. లేదా రాష్ట్రంలో 80 శాతం కోవిడ్ కేసుల్లో  చాలావరకు ఈ సిటీలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ లాక్ డౌన్ కాలంలో ఈ సిటీనుంచి ఎవరైనా వెళ్లాలనుకుంటే అలాంటి వారి దరఖాస్తులను పరిశీలించాలని నగర పోలీసులు నిర్ణయించారు. సిటీలో కరోనా కేసులు సుమారు రెండు వేలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడినుంచి వెళ్లాలనుకుంటున్నవారు దరఖాస్తులు పంపాలంటూ నగర పోలీసులు […]

ముంబై సిటీని వీడాలనుకుంటున్నారా ? అయితే మీకోసం....
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 4:41 PM

మహారాష్ట్రలో 11 కరోనా వైరస్ రెడ్ జోన్స్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ముంబై నగరం కూడా ఉంది. దేశంలో.. లేదా రాష్ట్రంలో 80 శాతం కోవిడ్ కేసుల్లో  చాలావరకు ఈ సిటీలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ లాక్ డౌన్ కాలంలో ఈ సిటీనుంచి ఎవరైనా వెళ్లాలనుకుంటే అలాంటి వారి దరఖాస్తులను పరిశీలించాలని నగర పోలీసులు నిర్ణయించారు. సిటీలో కరోనా కేసులు సుమారు రెండు వేలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడినుంచి వెళ్లాలనుకుంటున్నవారు దరఖాస్తులు పంపాలంటూ నగర పోలీసులు తమ వెబ్ సైట్ లోసంబంధిత ఫారాలను పోస్ట్ చేశారు. వీటిని భర్తీ చేసి ఇవ్వాలని ఖాకీలు కోరారు. లాక్ డౌన్ ని ప్రభుత్వం మే 3 వరకు పొడిగించిన దృష్ట్యా.. అనివార్య కారణాల వల్ల ఎవరైనా ముంబైని వదలి  వెళ్లాలనుకుంటే సంబంధిత దరఖాస్తు పత్రాన్ని  నింపాలని, లేదా 7738518130 నెంబరుకు ఫోన్ చేయాలని  కోరారు.  దీంతో ఆనేకమందినుంచి అప్లికేషన్లు వెల్లువలా వఛ్చిపడ్డాయి. అయితే వీరిని పోలీసులు ఎలా తరలిస్తారన్నది తెలియలేదు. బాంద్రా ఘటన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు సిటీ పోలీసులు ఈ వినూత్న వ్యూహానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది.