మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో అవయవాల పాత్ర కీలకం. అన్ని అవయవాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే సంపూర్ణ ఆరోగ్యం. అలాగే ఆ అవయవాలను సక్రమంగా పనిచేసేలా చూసుకోవాల్సిన బాధ్యత మనిషిపై ఉంటుంది. ప్రతి అవయవాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకే వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం. ఇదే క్రమంలో పై శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే శరీరం నుంచి దుర్వాసన రావడం సహజంగానే జరుగుతుంది. అందుకే రోజూ స్నానం తప్పనిసరి.
మనిషి ప్రతి రోజూ తప్పనిసరిగా చేసే పనులలో స్నానం ఒకటి. అయితే అందరూ స్నానం చేస్తారు. కానీ స్నానం చేసిన తర్వాత తరచూ కొందరూ కొన్ని తప్పులను చేస్తారు. అవి శరీర ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే స్నానం చేసిన తర్వాత తరచూ చేసే తప్పులేంటో మొదట తెలుసుకోవాలి. వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు జూహీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీపై దీనికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ స్నానం చేసే ఐదు తప్పులను ఆయన లిస్ట్ చేశారు. వాటిని మానుకోవాలని సూచించారు. అవేంటో ఓసారి చూద్దాం..
ఇవేకాక రోజూ స్నానం చేయకపోవడం, అధిక రసాయనాలు కలిగిన సబ్బులను వాడటం, మరి వేడి అధికంగా ఉన్న నీటితో స్నానం చేయడం, తలస్నానం తరచూ చేయకపోవడం వంటివి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వీలైనంత వరకూ వీటికి మార్చుకుంటే మేలు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..