వాతావరణ పరిస్థితులు మారినప్పుడు.. అందుకు అనుగుణంగా ఉండే ఆహార పదార్థాలు కూడా మీ డైట్లోకి చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. వర్షా కాలం, శీతా కాలంలో ఈ రెసిపీ ఎంతో హ్యాపీగా తినవచ్చు. వేడి చేస్తుందని భయం ఉండదు. పెప్పర్ రైస్ని బ్రేక్ ఫాస్ లేదా లంచ్లోకి కూడా తీసుకొచ్చు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే ఈ రైస్ తయారు చేయవచ్చు. ఈ రైస్లోకి కాంబినేషన్గా ఎలాంటి కర్రీలైనా తీసుకోవచ్చు. చాలా మందికి తెలీదు మిరియాలతో కూడా అన్నం తయారు చేసుకోవచ్చుని. ఈ రైస్ ఆరోగ్యమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. మరి ఈ పెప్పర్ రైస్ని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన అన్నం, మిరియాల పొడి, మిరియాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఆవాలు, శనగ పప్పు, కరివేపాకు, కొత్తి మీర, నెయ్యి లేదా నూనె, వేరు శనగ, ఇంగువ, ఉప్పు, జీడిపప్పు.
ముందుగా స్టవ్ మీద నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మిరియాల రైస్కి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ కడాయిలో ఆయిల్ లేదా ఘీ వేసి వేడి చేయాలి.
ఆ తర్వాత ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చి, శనగ పప్పు వేసి వేగాక కరివేపాకు వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ ఇంగువ పొడి, జీడి పప్పు, పల్లీలు, పచ్చి మిర్చి ఇలా ఒకదాని తర్వాత వేసి వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి ఓ ఐదు నిమిషాలు కలుపుకోవాలి. ఆ నెక్ట్స్ మిక్సీ పట్టిన మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. అన్నీ బాగా మిక్స్ చేశాక చివరిలో కొత్తిమీర చల్లి దింపేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మిరియాల రైస్ సిద్ధం.