వర్షా కాలం అంటే ఎంతో పీస్ ఫుల్గా అనిపిస్తుంది. వర్షాకాలాన్ని ఆశ్వాదించేలోపే మేము ఉన్నామంటూ రోగాలు కూడా గుర్తు చేస్తాయి. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం అని పెద్దలు అంటూ ఉంటారు. అలా వర్షం పడుతూ ఉంటే వేడి వేడి బజ్జీలు, పకోడీలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో లేని పోని రోగాలకు తోడు ఉన్న రోగాలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సీజన్లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధ పడేవారికి మరింత నొప్పులు పెరుగుతాయి. ఇంకెంత మందికి కూడా వస్తాయి. మరి వర్షా కాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అసలు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వర్షా కాలంలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. తేమ వల్ల కీళ్లు అనేవి కాస్త వదులుగా అనిపిస్తాయి. ఎముకలు కూడా నొప్పి వస్తాయి. అంతేకాకుండా వాతావరణం చల్లగా ఉండటం వల్ల చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్కి గురవుతారు. బాడీలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కీళ్ల నొప్పులు అనేవి వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సాధారణంగా కనిపించే గాలి పీడనాన్ని బారోమెట్రిక్ పీడనం అని కూడా పిలుస్తారు. వర్షా కాలంలో ఈ పీడనం అనేది తగ్గుతుంది. దీంతో శరీరంలోని కణ జాలాలు, కండరాల్లో వాపు, నొప్పి అనేవి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తక్కువ ఉష్ణోగ్రత కారణంగా కూడా కణజాలం, కండరాల కీళ్ల నొప్పులు, తిమ్మిరికి కారణం అవుతాయి.
వర్షా కాలంలో సాధారణంగా కాళ్లు, చేతుల కండరాలు నొప్పులుగా అనిపిస్తాయి. ఇక ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవారికి మరింతగా కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీరు కూడా తగిన చికిత్స తీసుకుంటూ.. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..