మరో నలుగురు పోతే బాబు హోదా గల్లంతే!

చంద్రబాబు హోదాకు ముప్పు వాటిల్లబోతోందా? అందుకు రంగం సిద్దమైపోయిందా? కొత్త సంవత్సరం తొలి రోజుల్లోనే చంద్రబాబుకు హోదా చేజారనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే ఆబ్జర్వేషనే వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇదివరకే ఒకరు చేజారారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయి, వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. టెక్నికల్‌గా సమస్యలుండడం, రాజీనామా చేసేందుకు వెనుకాడడం వల్ల వంశీ అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా మారిపోయారు. తాజాగా […]

మరో నలుగురు పోతే బాబు హోదా గల్లంతే!
Follow us

|

Updated on: Dec 31, 2019 | 7:49 PM

చంద్రబాబు హోదాకు ముప్పు వాటిల్లబోతోందా? అందుకు రంగం సిద్దమైపోయిందా? కొత్త సంవత్సరం తొలి రోజుల్లోనే చంద్రబాబుకు హోదా చేజారనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే ఆబ్జర్వేషనే వినిపిస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇదివరకే ఒకరు చేజారారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయి, వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. టెక్నికల్‌గా సమస్యలుండడం, రాజీనామా చేసేందుకు వెనుకాడడం వల్ల వంశీ అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా మారిపోయారు. తాజాగా ఏపీ క్యాపిటల్ ఇష్యూ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న తరుణంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు కూడా సేమ్ టు సేమ్ వంశీ తరహాలోనే నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత సాంకేతికంగా పార్టీ మారడం సాధ్యం కాకపోవడంతో తనను ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కోరనున్నట్లు ప్రకటించారు. సో.. టీడీపీ సంఖ్య 21కి తగ్గిపోయింది.

ఏపీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 175. అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలుంటేనే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది. అంటే ఇంకో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వంశీ, గిరిల బాటను ఎంచుకుంటే బాబుకు ‘ప్రత్యేక’ హోదా గల్లంతే అన్నమాట. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వ్యతిరేకించిన టీడీపీ అధిష్టానంతో దాదాపు విభేదించినంత పనిచేశారు విశాఖ నగరానికి చెందిన వాసుపల్లి గణేశ్, వెలగపూడి రామకృష్ణ. మరోవైపు గంటా శ్రీనివాస్ రావు కూడా మాటలకు చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీని వీడనంటూనే అంటీముట్టనట్లుంటున్నారు గంటా.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పైన పలువురు అనుమానంగానే వున్నారు. ఆయన కూడా ఏ క్షణమైనా పార్టీ మారేందుకు రెడీగా వున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కరణం బలరామ్‌తో ఆయనకున్న చిరకాల వైరం ఆసరాగా జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపుతూ రవికుమార్‌ని వైసీపీకి అనుకూలంగా మారేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది.

గంటా, గొట్టిపాటి, వెలగపూడి, వాసుపల్లి.. వీరు గనక టీడీపీకి గుడ్‌బై కొడితే.. ఆ మరుక్షణం చంద్రబాబుకున్న ‘ప్రత్యేక‘ హోదా అదే.. ప్రతిపక్ష నేత హోదా చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది జరగడానికి ఎన్నో రోజులు లేదని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నీ కుదిరితే.. సంక్రాంతి నాటికే పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పుకుంటున్నాయి అధికార పార్టీ వర్గాలు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో