అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ కీలక నిర్ణయం !
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. వైరల్ కంటెంట్ను నియంత్రించేందుకు ఫేస్బుక్ అత్యవసర యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. వైరల్ కంటెంట్ను నియంత్రించేందుకు ఫేస్బుక్ అత్యవసర యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు ఫేస్బుక్ ఈ వ్యవస్థ ద్వారా ప్రయత్నిస్తోందని ఈ కథనంలో పేర్కొంది.
‘సురక్షితమైన ఎలక్షన్స్ కోసం మేము ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాం. గత ఎన్నికల నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి ఇప్పుడు కొత్త పద్దతులు అనుసరించిబోతున్నాం. ఎక్స్పపర్ట్స్ను నియమించుకున్నాం. కొత్త టీమ్స్ ఏర్పాటు చేశాం.’ అని ఓ ఫేస్బుక్ అధికారి తెలిపినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఫేస్బుక్ తీసుకొస్తున్న ఈ చర్యలు వైరల్ కంటెంట్ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల కోసం రూపొందించినవి అని వాల్ల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మయన్మార్, శ్రీలంకల్లో వీటిని ఇప్పటికే వినియోగించారని… వైరల్ కంటెంట్ను నిరోధించేందుకు, విశ్వసనీయ సమాచారం గుర్తింపునకు ఫేస్బుక్ నూతన చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.
Also Read : కొత్త జాతీయ రహదారి: హైదరాబాద్- తిరుపతి మధ్య తగ్గనున్న 80కి.మీ దూరం