రేవంత్ రెడ్డికి అక్రమాలు కొత్త కాదు : గువ్వల బాలరాజు

తెలంగాణలో రేవంత్‌రెడ్డి సోదరులు భూ కబ్జా వ్యవహారం కాకరేపుతోంది. భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. శేర్‌లింగపల్లి డిప్యూటి కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. తప్పడు పత్రాలతో రేవంత్ బ్రదర్స్ గోపనపల్లిలోని భూములు కొనుగోలు చేశారని అనిల్ అనే వ్యక్తి  ఆరోపిస్తున్నారు.

రేవంత్ రెడ్డికి అక్రమాలు కొత్త కాదు : గువ్వల బాలరాజు
Follow us

|

Updated on: Feb 26, 2020 | 10:12 PM

తెలంగాణలో రేవంత్‌రెడ్డి సోదరులు భూ కబ్జా వ్యవహారం కాకరేపుతోంది. భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. శేర్‌లింగపల్లి డిప్యూటి కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. తప్పడు పత్రాలతో రేవంత్ బ్రదర్స్ గోపనపల్లిలోని భూములు కొనుగోలు చేశారని అనిల్ అనే వ్యక్తి  ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 127 పేరున ఉన్న భూములపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. ల్యాండ్ కోసం రేవంత్ సోదరులు తమను బెదిరిస్తున్నారని, భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అనిల్ ఆరోపిస్తున్నారు. కాగా రేవంత్ రెడ్డి బ్రదర్స్‌పై ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కోర్టులో 28 పేజీల చార్జ్‌షీట్ దాఖలు పోలీసులు.

ఇక రేవంత్ సోదరుల భూదందాపై తీవ్రంగా మండిపడ్డారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. అక్రమాలు చేయడం రేవంత్‌కి బాగా తెలుసని, ఉప్పల్ భూ కబ్జా పూర్తి సమాచాారం తమ వద్దని ఆయన పేర్కొన్నారు. ఇన్ని అక్రమాలు భయటపడ్డాక కూడా రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌ని చేస్తారో, సస్పెండ్ చేస్తారో తేల్చుకోవాలన్నారు.