Tollywood actress in Drugs case : సంచలనం.. డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టాలీవుడ్ హీరోయిన్ పరారీ
డ్రగ్స్ కేసులో దొరికిన టాలీవుడ్ నటి పరారయినట్లు తెలుస్తోంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేప్టటారు. మాఫియాడాన్ కరీంలాలాతో ఈ హీరోయిన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు.
Tollywood actress in Drugs case : డ్రగ్స్ కేసులో దొరికిన టాలీవుడ్ నటి పరారయినట్లు తెలుస్తోంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేప్టటారు. మాఫియాడాన్ కరీంలాలాతో ఈ హీరోయిన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు.
ముంబైలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నాలుగు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన నటిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న చాంద్ మహమ్మద్ను నుంచి 400గ్రాముల మెఫెడ్రోన్ ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8-10లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. కాగా డ్రగ్స్ సరఫరా చేసే టాలీవుడ్ నటి ఎవరన్నది ఎన్సీబీ అధికారులు ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రమంలో ఆమె పరారవ్వడం సంచలనంగా మారింది. మరోవైపు మాఫియా డాన్ కరీంలాలాపై ఎన్సీబీ లుకౌట్ నోటీసు జారీ చేసింది.
Also Read :