యూపీ మంత్రి భార్య షాకింగ్ లెటర్.. అది కూడా మోదీ, యోగీలకే..!
తన భర్త నిత్యం హింసిస్తున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్లకు మొరపెట్టుకుంటూ లేఖ రాశారు ఓ మంత్రి భార్య. ఆ మంత్రి కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఉత్తర్ ప్రదేశ్ యోగీ కేబినెట్లోని బాబురాం నిషాద్. తనను విడాకులకు సంబంధించిన పత్రాలపై సంతకం పెట్టాలంటూ బెదిరిస్తున్నారని.. లేకపోతే చంపేస్తానంటూ తనకు తుపాకీతో గురిపెడుతున్నారని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీ, సీఎం యోగీలకు మంత్రి బాబురాం భార్య నీతూ నిషాద్ లేఖ రాశారు. అయితే […]
తన భర్త నిత్యం హింసిస్తున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్లకు మొరపెట్టుకుంటూ లేఖ రాశారు ఓ మంత్రి భార్య. ఆ మంత్రి కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఉత్తర్ ప్రదేశ్ యోగీ కేబినెట్లోని బాబురాం నిషాద్. తనను విడాకులకు సంబంధించిన పత్రాలపై సంతకం పెట్టాలంటూ బెదిరిస్తున్నారని.. లేకపోతే చంపేస్తానంటూ తనకు తుపాకీతో గురిపెడుతున్నారని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీ, సీఎం యోగీలకు మంత్రి బాబురాం భార్య నీతూ నిషాద్ లేఖ రాశారు. అయితే ఈ లేఖలను తన ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేశారు. ఓ మంత్రి పదవిలో భాధ్యత చేపడుతూ.. ఇలా తనను తుపాకీ చూపించి కాల్చేస్తానని బెదిరించడం సమంజసమేనా అంటూ ఆ లేఖలో ప్రశ్నించారు. అంతేకాదు గతంలో చాలా సార్లు కొట్టాడని.. ఆ వేధింపుల భరించలేక చాలా సార్లు పోలీసులను ఆశ్రయించానని.. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. తన భర్త పలుకుబడితో పోలీసులు కూడా తన ఫిర్యాదు స్వీకరించలేదని.. వారంతా తన భర్తతో కుమ్మక్కయ్యారని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ఎదుర్కొంటున్న వేధింపులను కోర్టులో విన్నవించుకుంటానని పేర్కొన్నారు. అయితే ఏకంగా ఓ మంత్రి భార్య ఇలా ప్రధాని, సీఎంలకు లేఖలు రాయడం సంచలనంగా మారింది. అది కూడా సొంత పార్టీకి చెందిన మంత్రి అవ్వడంతో బీజేపీ అధిష్టానం ఆ లేఖపై ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.