GHMC Elections Results 2020: హరీష్ నేతృత్వంలో ఆ మూడు డివిజన్లు…అభ్యర్థుల ఘన విజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. పలు డివిజన్లలో కారు స్పీడుతో దూసుకుపోతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులంతా ఫుల్ జోష్లో ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఇంఛార్జిగా ఉన్న మూడు డివిజన్లలో..
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. పలు డివిజన్లలో కారు స్పీడుతో దూసుకుపోతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులంతా ఫుల్ జోష్లో ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఇంఛార్జిగా ఉన్న మూడు డివిజన్లలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. రామచంద్రాపురం, భారతి నగర్, పఠాన్ చెరువు డివిజన్లలో గులాబీ గుభాళించింది.
112వ డివిజన్ రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్ భారీ ఆధిక్యం కొనసాగించారు. అనంతరం గ్రేటర్ పోరులో ఆమె విజయ బావుటా ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్పై 5759 ఓట్లతో పుష్ప విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆమె సంబరాలు చేసుకున్నారు.
అటు, భారతీ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సింధూ ఆదర్శ్ రెడ్డి భారీ విజయం సాధించారు. 4658 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యార్థిపై గెలుపొందారు. పటాన్చెరులోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్ విజయం 6 వేల పై చిలుకు ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు.సింధూ ఆదర్శ్ రెడ్డి ప్రత్యార్థి కంటే, 6082 ఓట్లు అధికంగా సాధించారు.