తెలంగాణ కరోనా నేటి బులిటెన్ : కొత్తగా ఎన్ని కేసులంటే ?
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. 1,781 మంది వ్యాధి బారి నుంచి కోలుకోని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 99,391 చేరినట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి 76,967మంది కోలుకున్నట్లు వివరించింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 21,687 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 737 కి చేరింది.
Also Read :
వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !