రోడ్డు వెంట గనిలో పేలిన బాంబు.. ఏడుగురు మృతి

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 7:02 PM

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. పేలుడు ధాటికి రోడ్డు వెంట వెళ్తున్న వాహనం తునాతునకలు..

రోడ్డు వెంట గనిలో పేలిన బాంబు.. ఏడుగురు మృతి
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. పేలుడు ధాటికి రోడ్డు వెంట వెళ్తున్న వాహనం తునాతునకలు అవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృత్యువాత పడ్డారని వారు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దురు పిల్లలు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబాన్లతో సహా ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

కోవిడ్ పేషెంట్స్ శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు