నీ తరంలోనే అథ్లెట్ అయినందుకు గర్విస్తున్నా…
భారత టెన్నిస్ స్టార్ సానియా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై స్పందించారు. ధోనీ ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్ అయినందుకు గర్వపడుతున్నట్లు....
ధోనీ రిటైర్మెంట్ను క్రీడాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అమిత్ షా నుంచి సామాన్య ఆటగాడి వరకు అంతా ధోనీని స్మరిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే ఇదే వరసలో సానియా మీర్జా కూడా చేరారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై స్పందించారు. ధోనీ ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్ అయినందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు సానియా మ . మహీద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
‘ధోనీ నువ్వో దిగ్గజం. నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రీడాకారుల్లో నువ్వూ ఒకడివి. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. అలాగే నీ భవిష్యత్ మరింత బాగుండాలని ఆశిస్తున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఒక క్రీడాకారిణి అయినందుకు గర్విస్తున్నా’ అని పేర్కొంది.
#DHONI what a legend you are .. one of my all time fav athletes and personalities on and off the field .. thank you for everything you have done and good luck with the future .. it’s been an honor to be an athlete in the same era as you from the same country ??
— Sania Mirza (@MirzaSania) August 16, 2020
అనూహ్య నిర్ణయంతో యావత్ క్రీడాలోకాన్ని షాక్కు గురిచేసిన మిస్టర్ కూల్ ధోనీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శుభాకాంక్షలు తెలిపింది. ఒక తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ధోనీ ఆటను మిస్ అవుతున్నామని ఐసీసీ సీఈవో మను సాహ్నీ పేర్కొన్నారు. ఎంఎస్ ధోనీ ఆల్టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ధోనీ ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్లో అతడు కొట్టిన విన్నింగ్ షాట్ ప్రపంచ క్రికెట్ అభిమానుల మనసులో ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది.. అతడు మొత్తం తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. అతడి ఆటను మిస్సవుతాం. ఈ సందర్భంలో అతడికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా అని సాహ్నీ పేర్కొన్నారు.