హైదరాబాద్ అల్లుడికి చుక్కెదురు.. జట్టులో దక్కని చోటు

|

Nov 11, 2020 | 11:23 PM

న్యూజిలాండ్​ పర్యటన కోసం 35 మందితో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది. అందులో ఆల్​రౌండర్ షోయబ్​ మాలిక్​, పేసర్​ మహమ్మద్​ అమీర్​లకు స్థానం దక్కలేదు. యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారిని....

హైదరాబాద్ అల్లుడికి చుక్కెదురు.. జట్టులో దక్కని చోటు
Follow us on

న్యూజిలాండ్​ పర్యటన కోసం 35 మందితో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది. అందులో ఆల్​రౌండర్ షోయబ్​ మాలిక్​, పేసర్​ మహమ్మద్​ అమీర్​లకు స్థానం దక్కలేదు. యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారిని సెలెక్ట్​ చేయలేదని పీసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా న్యూజిలాండ్-పాకిస్థాన్​ మధ్య వచ్చే నెలలో టెస్టు సిరీస్​ జరగనుంది. దాని కంటే ముందుగా డిసెంబరు 18, 20, 22 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్​లను నిర్వహించనున్నారు.

నవంబరు 23న కివీస్​ పర్యటనకు పాక్​ జట్టు బయలుదేరనుంది. పాకిస్థాన్​ టెస్టు జట్టుకు కెప్టెన్​గా బాబర్ అజామ్​ను మంగళవారం పీసీబీ నియమించగా.. వైస్​ కెప్టెన్​గా మొహమ్మద్​ రిజ్వాన్​ను ఎంపిక చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయో-బబుల్​ను ఏర్పాటు చేసి కివీస్​, పాక్​ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ను నిర్వహించనున్నారు.