ఓటమి బాధ.. జైలులో ముద్ద ముట్టని లాలూ..!
దాణా కుంభకోణం కేసులో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్.. రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. కొన్ని రోజుల నుండి ఆయన జైలులో ముద్ద ముట్టడం లేదట..! ఎవరితోనూ మాట్లాడటం లేదట..! లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి తెలిసినప్పటి నుంచి ఆయన ఇలానే ప్రవర్తిస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. కేవలం ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం మాత్రమే తీసుకుంటున్నారని, దీంతో.. ఆయనకు సకాలంలో ఇన్సులిన్ డోసులు వేయలేకపోతున్నామని జైలు అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క […]
దాణా కుంభకోణం కేసులో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్.. రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. కొన్ని రోజుల నుండి ఆయన జైలులో ముద్ద ముట్టడం లేదట..! ఎవరితోనూ మాట్లాడటం లేదట..! లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి తెలిసినప్పటి నుంచి ఆయన ఇలానే ప్రవర్తిస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. కేవలం ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం మాత్రమే తీసుకుంటున్నారని, దీంతో.. ఆయనకు సకాలంలో ఇన్సులిన్ డోసులు వేయలేకపోతున్నామని జైలు అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో లాలూ కుంగుబాటుకు గురయ్యారని అంటున్నారు.