మాయమాటలతో మూడుకోట్లుపైగా కొట్టేశాడు

గతేడాది సైబరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 10 టన్నుల అమ్మోనియా తరలించిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు తరలించిన కేసులో..

మాయమాటలతో మూడుకోట్లుపైగా కొట్టేశాడు
Follow us

|

Updated on: Aug 25, 2020 | 7:48 PM

గతేడాది సైబరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 10 టన్నుల అమ్మోనియా తరలించిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు తరలించిన కేసులో రాజ్ కుమార్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఆసరా చేసుకుని కపిల్ రాజేంద్ర అనే వ్యక్తి రాజ్ కుమార్ నుంచి భారీగా డబ్బు గుంజడం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసులో బెయిల్ పై విడుదల చేయిస్తా అని రాజ్ కుమార్ ను నమ్మించిన సన్నిహితుడు కపిల్ కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో హవాలా ఏజెంట్ ద్వారా రాజ్ కుమార్ 60 లక్షలు చెల్లించాడు. తర్వాత మొత్తం కేస్ ను మూసి వేయించడానికి సీనియర్ పోలిస్ అధికారులకు 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటు రాజ్ కుమార్ ను నమ్మించిన కపిల్.. కోటిన్నర కొట్టేశాడు. అయితే, ఈ డబ్బు తో సంబంధం లేకుండా రాజ్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్ట్.

ఇక, జైల్ నుండి బయటికి వచ్చాక కపిల్ కు మరో 20 లక్షలు చెల్లించాడు రాజ్ కుమార్. అయితే, తిరిగి రాజ్ కుమార్ పై గత ఏడాది అక్టోబర్ లో మరో కేస్ నమోదు చేశారు ఎస్వో టి పోలీసులు. భువనగిరి నుండి ఇతర రాష్ట్రాలకు కంటైనర్ లలో పేలుడు సామగ్రి నీ తరలిస్తున్న రాజ్ కుమార్ పై కేసులు మోపారు. ఇందులో భాగంగా అక్టోబర్ లో రాజ్ కుమార్ కంపెనీ పై భువనగిరిలో లో దాడులు చేశారు. దీంతో మళ్లీ ఎంటరైన కపిల్.. తాజా రెండు కేసులు ముయిస్తా అంటూ 35 లక్షలు డిమాండ్ చేశాడు. వీటి పై పాట్నా బీహార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారంటూ రాజ్ కుమార్ ను భయపెట్టాడు. వాళ్ళను నీ జోలికి రాకుండా చుసుకుంటానంటు రాజ్ కుమార్ దగ్గర మరో కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో మొత్తంగా 3 కోట్ల 60 లక్షలు కపిల్ కు చెల్లించాడు రాజ్ కుమార్.

అయితే, ఇంకా డబ్బు కావాలని బెదిరిస్తుండటంతో కపిల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాజ్ కుమార్. దీంతో పూణె కి వెళ్లి కపిల్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మొత్తం వ్యవహారంపై కూపీలాగే పనిలో పడ్డారు.

Latest Articles