స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డును గెలుచుకున్న నగరమిదే..
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరుసగా
Indore’s Fourth Consecutive Win : కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది. అయితే తొలి ఎడిషన్లో మైసూర్ నగరం ఈ అవర్డును దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాది పోటీలో రాలేక పోయింది.
రెండో స్థానంలో గుజరాత్లోని సూరత్, మూడో స్థానంలో మహారాష్ట్రలోని నవీ ముంబై నిలిచాయి. అత్యుత్తమ గంగా నగరంగా వారణాసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్గా ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం ఖ్యాతి’ సాధించింది. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు ఉన్నాయి. గురువారం ‘స్వచ్ఛ మహోత్సవ్’ కార్యక్రమంలో కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల మంత్రి హరదీప్ సింగ్ పూరీ ఈ అవార్డులను ప్రకటించారు.
4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు.