సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..
బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్దమైంది. ఈ ఏడాది రూ.68,500 చొప్పున ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది.
Singareni Employees: బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్దమైంది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్ చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది రూ.68,500 చొప్పున ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీ నుంచి కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. దీనికి సంబంధించిన సర్కిలర్ను తాజా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జేబీసీసీఐ 10వ సమావేశంలో జరిగిన ఒప్పందం మేరకు బోనస్ను చెల్లిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితో సింగరేణిలో పని చేస్తోన్న దాదాపు 43 వేల మందికి ఈ దీపావళి కానుక అందనుంది.
Also Read:
ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ
అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..
మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!
ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం