Farmers Protests:రైతుల శాంతియుత ప్రదర్శనలను అడ్డుకోవడం సముచితం కాదు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ అన్నదాతలు చేస్తున్న శాంతియుత ప్రదర్శనలను అడ్డుకోవడం ఏమాత్రం సముచితం కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

Farmers Protests:రైతుల శాంతియుత ప్రదర్శనలను అడ్డుకోవడం సముచితం కాదు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 26, 2020 | 4:31 PM

కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ అన్నదాతలు చేస్తున్న శాంతియుత ప్రదర్శనలను అడ్డుకోవడం ఏమాత్రం సముచితం కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నిరసన ప్రదర్శనలు చేయడం వారి రాజ్యాంగ బధ్ద హక్కు అని ఆయన ట్వీట్ చేశారు. కేంద్రం ప్రకటించిన మూడు చట్టాలూ వారికి వ్యతిరేకమైనవని, వీటిని ఉపసంహరించే బదులు, వారిని అడ్డుకోవడం, వారిపై వాటర్ క్యానన్లను ప్రయోగించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత మార్చ్ లను అడ్డుకోవడంలోని ఉచితానుచితాలపై  ప్రభుత్వం యోచన  చేయాలని ఆయన కోరారు. కాగా హర్యానా…. పంజాబ్ తో గల తన సరిహద్దులను మూసివేసింది. బస్సు సర్వీసులను రద్దు చేసింది. అటు ఢిల్లీతో గల బోర్డర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించింది.