ఇండియాలో డేంజరస్ ఏరియాస్‌ ఇవే..!

| Edited By:

Nov 30, 2019 | 9:23 PM

ఇండియాలో డేంజర్‌ సిటీస్‌ ఉన్నాయా..? ఆ నగరాల్లో మహిళలకు భద్రత ఉందా..? అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఉందా..? గూగుల్‌ ట్రెండ్స్‌ అదే సూచిస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఉంది. గూగుల్‌ ట్రెండ్స్‌లో తరచుగా సెక్స్‌ అనే పదాన్ని టైప్‌ చేసే ఏడు దేశాల్లో ఇండియా ఒకటని తెలిపింది. భారత్‌లో మహిళ ఘోరమైన స్థానంలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో […]

ఇండియాలో డేంజరస్ ఏరియాస్‌ ఇవే..!
Follow us on

ఇండియాలో డేంజర్‌ సిటీస్‌ ఉన్నాయా..? ఆ నగరాల్లో మహిళలకు భద్రత ఉందా..? అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఉందా..? గూగుల్‌ ట్రెండ్స్‌ అదే సూచిస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఉంది. గూగుల్‌ ట్రెండ్స్‌లో తరచుగా సెక్స్‌ అనే పదాన్ని టైప్‌ చేసే ఏడు దేశాల్లో ఇండియా ఒకటని తెలిపింది. భారత్‌లో మహిళ ఘోరమైన స్థానంలో ఉందని స్పష్టం చేసింది.

దేశంలో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాలు, మెట్రోనగరాల్లో కూడా మహిళలు బయట తిరగడానికి భయపడి పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు సురక్షితం కానీ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇటీవల జరిగిన గ్యాంగ్ అత్యాచార సంఘటనతో ఢిల్లీకి రేప్‌ రాజధానిగా కొత్త టైటిల్‌ వచ్చింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ బ్యూరో ప్రకారం.. రాజధాని మొత్తం రేప్‌ కేసులు 23.8 శాతం అని తేలింది. ఇక నోయిడాలో ఉన్నట్లయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

దేశరాజధాని ఢిల్లీతోపాటు నోయిడా, గుర్‌గావ్‌, కోల్‌కత్తా, బెంగళూరు, ముంబై, పూణె, ఉత్తరప్రదేశ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, హైదరాబాద్‌లో హింసాత్మక నేరాలు ఎక్కువని NCRB రిపోర్టు తేల్చింది. మహిళలు సందర్శించకూడని ప్రదేశాలు అని స్పష్టం చేసింది. ఢిల్లీ శివారు నోయిడా, హర్యానాలోని అతిపెద్ద నగరం గుర్గావ్‌ డేంజర్‌ సిటీస్‌ అని తెలిపింది. ఇక్కడ పనిచేసే మహిళ ఉద్యోగుల్లో వేధింపులు, అపహరణ, నేరాల ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌ మహిళలపై ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా రాజధాని కోల్‌కతాలోని మహిళలపట్ల ఈవ్‌-టీజింగ్‌, వేధింపులు, అత్యాచారం తరచూ జరుగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఏమి చేయలేని పరిస్ధితి దాపురించింది. ఇక ఆర్థిక నగరం ముంబైలో కూడా దేశంలో జరిగే రేప్‌కేసులో 10.8 శాతం ఇక్కడే జరుగుతున్నాయని NCRB రిపోర్టు చెబుతోంది. వేశ్యవృత్తిని న్యాయమైన పనిగా చేయడంతో ఈ నగరం కూడా మహిళల సందర్శనకు సురక్షితం కాదని తెలిపింది.

ఇక హైదరాబాద్‌ నగరంలో కూడా ఇప్పుడిప్పుడే నేరాల సంఖ్య పెరుగుతోందని NCRB రిపోర్టు చెబుతోంది. 2011లో హైదరాబాద్‌లో 157 వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంతేకాదు రేప్‌ల సంఖ్య కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిటీ కూడా మహిళలకు సురక్షితం కాదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సో…బీర్‌ కేర్‌ఫుల్‌. ఎక్కడికి వెళ్లినా…మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. డేంజర్‌ లిస్టుల్లో ఉన్న నగరాల్లో మహిళలు ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తోంది.