రైతు సంఘాల్లో చీలికలు, బీకేయూ, సంయుక్త కిసాన్ మోర్చా మధ్య విభేదాలు, మారుతున్న అజెండాలు

రైతు చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 40 కి పైగా రైతు సంఘాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి. ఈ చట్టాలపై చర్చకు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని..

రైతు సంఘాల్లో చీలికలు, బీకేయూ, సంయుక్త కిసాన్ మోర్చా మధ్య విభేదాలు, మారుతున్న అజెండాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2021 | 5:45 PM

రైతు చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 40 కి పైగా రైతు సంఘాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి. ఈ చట్టాలపై చర్చకు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ ఛాదుని తీసుకున్న నిర్ణయం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. రాజకీయ పార్టీలకు, తమ నిరసనకు సంబంధం ఉండరాదని ఈ మోర్చా నేత హసన్ మొల్లా అంటున్నారు. గుర్నామ్ సింగ్ నిర్ణయాలను తాము పట్టించుకోబోమని, మా సొంత అజెండా మాకు ఉందని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం అన్న ప్రతిపాదనను తాము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. బహుశా అది ఆయన సొంత అభిప్రాయమై ఉండవచ్ఛు అన్నారు. తమ నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలనే అమలు చేస్తామని ఆయన న్నారు. అయితే తమ నేతకు అసలు పార్టీలతో సంబంధమే లేదని గుర్నామ్ సింగ్ తరఫు ప్రతినిధి ఒకరు చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పలుకుబడి ఉన్న గుర్నామ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో పలు విపక్షాల నేతలను కలిసి తన ప్రతిపాదన గురించి చర్చించారు. ఇలా ఉండగా ఈ నెల 26 న నిర్వహించే  ట్రాక్టర్ ర్యాలీ పై కూడా రైతు సంఘాల్లో మెల్లగా విభేదాలు తలెత్తుతున్నాయి.

Read Also:రైతు చట్టాలపై పంజాబ్-హర్యానా రైతుల నిరసన, ‘ఢిల్లీ చలో’ కు పిలుపు, బోర్డర్లో చేరుతున్న వందలాదిమంది.

Read Also:రైతు సంఘాల ప్రతినిధులతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు.. మూడు గంటలుగా సాగుతున్న భేటీ..

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు