తోడికోడళ్ల మధ్య నీటి యుద్ధం.. రెండు గ్రామాల మధ్య వైరం..

ఒక్కోసారి చిన్న చిన్న తగాదాలే పెద్ద గొడవలకు దారి తీసి రక్తపాతాలు జరిగేలా చేస్తాయి. ఇక సరిగా ఇలాంటి గొడవ చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలం నక్కలదిన్నెవడ్డిపల్లిలో జరిగింది. ఇద్దరు తోడికోడళ్లు మధ్య జరిగిన చిన్న తగాదా ఏకంగా రెండు గ్రామాలు తగలబెట్టుకునే స్థాయికి వెళ్ళింది. వివరాల్లోకి వెళ్తే.. నక్కలదిన్నెవడ్డిపల్లి గ్రామంలో నివసించే ఇద్దరు తోడికోడళ్లు నిర్మల, చామంతి నల్లా వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య చిన్న తగాదా ఏర్పడింది. ఆ తర్వాత […]

తోడికోడళ్ల మధ్య నీటి యుద్ధం.. రెండు గ్రామాల మధ్య వైరం..
Follow us

|

Updated on: May 24, 2020 | 7:22 PM

ఒక్కోసారి చిన్న చిన్న తగాదాలే పెద్ద గొడవలకు దారి తీసి రక్తపాతాలు జరిగేలా చేస్తాయి. ఇక సరిగా ఇలాంటి గొడవ చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలం నక్కలదిన్నెవడ్డిపల్లిలో జరిగింది. ఇద్దరు తోడికోడళ్లు మధ్య జరిగిన చిన్న తగాదా ఏకంగా రెండు గ్రామాలు తగలబెట్టుకునే స్థాయికి వెళ్ళింది.

వివరాల్లోకి వెళ్తే.. నక్కలదిన్నెవడ్డిపల్లి గ్రామంలో నివసించే ఇద్దరు తోడికోడళ్లు నిర్మల, చామంతి నల్లా వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య చిన్న తగాదా ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా పెద్దదైంది. ఇక ఈ విషయాన్ని చిన్న కోడలైన నిర్మల జరిగిన విషయాన్ని కెవిపల్లి మండలం నూతనకాల్వ గ్రామంలోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది.

చెల్లెలు నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన 3 కార్లు, బైక్‌లపై వడ్డిపల్లికి చేరుకుని నిర్మలతో గొడవపడ్డ వారితో ఘర్షణకు దిగాడు నిర్మల అన్న. దీనితో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్లు రువ్వుకోవడమే కాకుండా కార్లను కూడా తగలబెట్టారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.