శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం

హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం పత్రాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొన్నారు. వీరికి ముఖ్యమంత్రి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్‌లో స్థలం కేటాయించడం ఎంతో గొప్పవిషయంగా కొనియాడారు స్వామి. స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ తన గురువు ఆదేశాలతో […]

శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 27, 2019 | 8:36 PM

హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం పత్రాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొన్నారు. వీరికి ముఖ్యమంత్రి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్‌లో స్థలం కేటాయించడం ఎంతో గొప్పవిషయంగా కొనియాడారు స్వామి.

స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ తన గురువు ఆదేశాలతో దేశం నలుమూలలా తిరిగి శంకర అద్వైతాన్ని ప్రచారం చేస్తామని.. ఈ ధర్మ ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.