ఏపీలో భోగి మంటల పొలిటికల్ హీట్, ప్రభుత్వ జీవోలను మంటల్లో పడేసిన టీడీపీ నేతలు, ఇదేమి కడుపుమంటోనని వైసీపీ సెటైర్లు

ఏపీలో భోగి మంటలు రాజకీయ కాక రేపాయి. రాజకీయ నేతల భోగి మంటలు ఏపీలో పొలిటికల్‌ సెగలు కక్కాయి. పండుగ రోజూ పాలిటిక్స్‌ నడిచాయి...

ఏపీలో భోగి మంటల పొలిటికల్ హీట్, ప్రభుత్వ జీవోలను మంటల్లో పడేసిన టీడీపీ నేతలు, ఇదేమి కడుపుమంటోనని వైసీపీ సెటైర్లు
Follow us

|

Updated on: Jan 13, 2021 | 8:00 PM

ఏపీలో భోగి మంటలు రాజకీయ కాక రేపాయి. రాజకీయ నేతల భోగి మంటలు ఏపీలో పొలిటికల్‌ సెగలు కక్కాయి. పండుగ రోజూ పాలిటిక్స్‌ నడిచాయి. రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఆ మంటల్లో పడేసి కాల్చారు టీడీపీ నేతలు. చాలా చోట్ల టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ జీవోలను మంటల్లో వేసి కాల్చారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. కృష్ణాజిల్లా పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఐదు జీవో పేపర్లను మంటల్లో వేశారు. మోటార్లకు మీటర్లతో ఉచిత విద్యుత్‌ ఉద్దేశాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే జగన్‌ ఏం చేస్తున్నారో చూడాలన్నారు. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

అయితే, జీవో కాపీలను భోగి మంటల్లో వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది వైసీపీ. రైతులకు జరుగుతున్న మంచిని తట్టుకోలేని కడుపు మంటతోనే ఇలా చేశారని విమర్శించారు నేతలు. నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఈ సందర్భంగానే ఆమె చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. మంత్రి వెల్లంపల్లి కూడా చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు. రైతులకు మంచి చేస్తుంటే.. వాళ్లకు ఇదేమి కడుపు మంటో అర్థం కావడం లేదంటూ కౌంటర్లు ఇచ్చారు వైసీపీ నేతలు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?