ఏపీ: పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
Guidelines For Conduction Of Exams: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో ఈ నెల 30వ తేదీలోపు ఫైనలియర్, ఇతర సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఏపీ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వివరించారు.
కరోనా నివారణా చర్యలు…
- ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం, ఫేస్ కవర్లు లేదా మాస్కుల ధరించడం తప్పనిసరి.
- తరుచుగా నీటితో లేదా శానిటైజర్తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూపేపర్ను అడ్డుపెట్టుకోవాలి. అంతేకాకుండా వాడిన టిష్యూపేపర్ను జాగ్రత్తగా చెత్తబుట్టలో పడేయాలి.
- ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
- బహిరంగంగా ఉమ్మి వేయడం నిషేధం.
- ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి.
పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష నిర్వహణకు అనుమతి లేదు. అంతేకాకుండా ఆయా జోన్లలో ఉన్న సిబ్బందిని, విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించకూడదు.
- కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులకు స్పెషల్గా పరీక్ష నిర్వహించడం, లేదంటే వేరే మార్గాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలి.
- పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ మంది విద్యార్థులు గుమిగూడకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.
- భౌతిక దూరం ఉండేలా సీటింగ్ అరెంజ్మెంట్స్ ఉండాలి.
- పరీక్షా కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్, హైపోక్లోరైట్ సొల్యూషన్ లాంటి వాటిని ఏర్పాటు చేయాలి.
- విద్యార్థులు స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వాలి.
- కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ పోస్టర్లు, వీడియోలను పరీక్షా కేంద్రాల వద్ద ప్రదర్శించాలి.
- కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించాలి.
- విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు..