సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర్లో పేలుడు కలకలం
రాజధాని నగరం హైదరాబాద్ లో శనివారం జగద్గిరిగుట్ట దగ్గర పేలుడు ఘటన కలవరం రేపితే, ఇవాళ ఆదివారం మరోచోట పేలుడు నగరవాసుల్ని కంగారు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 31 బస్ స్టాప్ దగ్గర్లోని ముత్యాలమ్మ టెంపుల్ ముందు చెత్త డబ్బాలో ఉన్న కెమికల్ డబ్బా భారీ శబ్ధంతో పేలింది. ఈ ఘటలో చెత్త ఏరుకునే రాజు అనే వృద్ధుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని హుటాహటీన108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, బాంబు స్క్వాడ్, […]
రాజధాని నగరం హైదరాబాద్ లో శనివారం జగద్గిరిగుట్ట దగ్గర పేలుడు ఘటన కలవరం రేపితే, ఇవాళ ఆదివారం మరోచోట పేలుడు నగరవాసుల్ని కంగారు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 31 బస్ స్టాప్ దగ్గర్లోని ముత్యాలమ్మ టెంపుల్ ముందు చెత్త డబ్బాలో ఉన్న కెమికల్ డబ్బా భారీ శబ్ధంతో పేలింది. ఈ ఘటలో చెత్త ఏరుకునే రాజు అనే వృద్ధుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని హుటాహటీన108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.