జ్యోతి కిడ్నాప్లో కొత్త ట్విస్ట్: కానిస్టేబుల్ భగీరథ ఆచారి కొత్తమాట
జ్యోతి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్ ఐన పోలీస్ కానిస్టేబుల్ భగీరథ ఆచారి తో పాటు, బాధితురాలు జ్యోతి ప్రస్తుతం అనంతపురం జిల్లా పోలీసుల అదుపులో ఉన్నారు. జ్యోతిని కిడ్నాప్ చేసిన వ్యవహారంపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ భగీరథను డీఎస్పీ రాఘవరెడ్డి విచారిస్తున్నారు. అంతకుముందు అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలతో బనగానపల్లె పోలీసుల దగ్గర నుంచి జ్యోతిని తమ సంరక్షణలోకి తీసుకొన్నారు అనంతపురం పోలీసులు. కిడ్నాపర్ భగీరథను కూడా […]
జ్యోతి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్ ఐన పోలీస్ కానిస్టేబుల్ భగీరథ ఆచారి తో పాటు, బాధితురాలు జ్యోతి ప్రస్తుతం అనంతపురం జిల్లా పోలీసుల అదుపులో ఉన్నారు. జ్యోతిని కిడ్నాప్ చేసిన వ్యవహారంపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ భగీరథను డీఎస్పీ రాఘవరెడ్డి విచారిస్తున్నారు. అంతకుముందు అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలతో బనగానపల్లె పోలీసుల దగ్గర నుంచి జ్యోతిని తమ సంరక్షణలోకి తీసుకొన్నారు అనంతపురం పోలీసులు. కిడ్నాపర్ భగీరథను కూడా అదుపులోకి తీసుకున్న అనంతపురం డీఎస్పీ.. ఘటన పూర్వాపరాలపై సుధీర్ఘంగా విచారిస్తున్నారు. అయితే, పోలీస్ కానిస్టేబుల్ భగీరథపై కిడ్నాప్ కేసు పెట్టవద్దని పోలీసులను జ్యోతి కోరినట్లు సమాచారం. తమ అమ్మానాన్నలు ఒప్పుకుంటేనే కానిస్టేబుల్ భగీరథను పెళ్లి చేసుకుంటానని జ్యోతి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఇలాఉండగా, కర్నూలుకు చెందిన జ్యోతి కిడ్నాప్ కథ నిన్న రాత్రి సుఖాంతమైన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ భగీరథ ఆచారి ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. జ్యోతిని కూడా సేఫ్గా తీసుకువచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకే కిడ్నాప్ చేసినట్టు తెలిపాడు. వాహనాలు మార్చుతూ పోలీసులను కూడా ముప్పతిప్పలు పెట్టినప్పటికీ.. చివరకు లొంగిపోక తప్పలేదు భగీరథకు.