కరోనా కాటుతో జామా మసీదు షాహీ ఇమామ్‌ పీఆర్‌ఓ మృతి

కరోనా మహమ్మారి కాటేయడంతో.. ఢిల్లీలోని జామా మసీద్ షాహీ ఇమామ్‌ పీఆర్ఓ అమానుల్లా మరణించారు. మంగళవారం రాత్రి నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.

కరోనా కాటుతో జామా మసీదు షాహీ ఇమామ్‌ పీఆర్‌ఓ మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 8:19 PM

కరోనా మహమ్మారి కాటేయడంతో.. ఢిల్లీలోని జామా మసీద్ షాహీ ఇమామ్‌ పీఆర్ఓ అమానుల్లా మరణించారు. మంగళవారం రాత్రి నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. ఇతడు జామియా నగర్‌కి చెందిన వాడు. ఈ నెల 2వ తేదీన కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. గత 20 రోజులుగా అస్వస్థతకు గురవ్వడంతో.. మసీదుకు కూడా రావవడం లేదని షాహీ ఇమామ్ తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరారని.. ఆయనకు మధుమేహం ఉండటంతో పాటు గతంలో బైపాస్ సర్జరీ కూడా అయినట్లు తెలిపారు. ఆరు రోజుల క్రితమే ఆయకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారని.. మంగళవారం నాడు గుండెపోటు కూడా వచ్చిందన్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. గత 35 ఏళ్లుగా జామా మసీదు షాహీ ఇమామ్‌ పీఆర్‌ఓగా విధులు నిర్వర్తించారు.