Breaking: జూన్ 30 వరకు ప్యాసింజర్ రైళ్లు రద్దు..
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కధనం ప్రచురితమైంది. దీనితో జూన్ 30 వరకు శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ మినహా ప్యాసింజర్ రైళ్లు తిరగవనే చెప్పాలి. ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో […]
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కధనం ప్రచురితమైంది. దీనితో జూన్ 30 వరకు శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ మినహా ప్యాసింజర్ రైళ్లు తిరగవనే చెప్పాలి.
ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని రిపోర్టు తెలిపింది. మరి ఈ నిర్ణయం రైల్వేశాఖ ఎందుకు తీసుకుందోనన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Read This: కరోనా ఎప్పటికీ మనల్ని విడిచిపోదు.. డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు..
#Breaking | Railways announce refund policy, all tickets till 30th June will be canceled. Only Shramik trains will run.
TIMES NOW’s Srinjoy Chowdhury with details. pic.twitter.com/AU985vWVG3
— TIMES NOW (@TimesNow) May 14, 2020
Indian Railways cancels all tickets booked to travel on or before June 30th, 2020. Refunds given to all tickets booked till 30th June 2020. All special trains and Shramik Special train to however ply as usual. pic.twitter.com/5Pgs09WB2t
— ANI (@ANI) May 14, 2020