IND Vs NZ: కోహ్లీ కంటే స్మిత్ గ్రేట్.. నెటిజన్లు కామెంట్స్…

కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరడంతో నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. టెస్టుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ కంటే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గ్రేట్ అని కితాబిస్తున్నారు.

IND Vs NZ: కోహ్లీ కంటే స్మిత్ గ్రేట్.. నెటిజన్లు కామెంట్స్...
Follow us

|

Updated on: Feb 23, 2020 | 6:17 AM

IND Vs NZ: కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరడంతో నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. టెస్టుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ కంటే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గ్రేట్ అని కితాబిస్తున్నారు. కోహ్లీ కేవలం ఫ్లాట్ పిచ్‌లపైనే పరుగులు రాబడతాడని.. ట్రిక్కీ పిచ్‌లపై విఫలమవుతాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టీవ్ స్మిత్ మాత్రం గ్రౌండ్ ఏదైనా కూడా అద్భుతంగా రాణిస్తాడని అంటున్నారు.

న్యూజిలాండ్ సిరీస్‌లో 8 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రం చేయగలిగాడు. గతంలో ఇలాగే 2014 ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా విఫలం కాగా.. 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో విమర్శకుల నోర్లు మూయిస్తూ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 165 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జమీసన్, సౌథీలు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

Also Read: ఆ జట్టులో కోహ్లీ, ధావన్‌లకు చోటు.. రోహిత్‌కు నో ఛాన్స్..