జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!
జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కుషాయిగూడలోని ఏఎస్ రావు నగర్లో నివాసముంటున్న సంతోష్ చౌహాన్.. స్థానిక వ్యాపారి పరమేశ్ పాటిల్ దగ్గర పనిచేస్తున్నాడు. అయితే గత రాత్రి జీతం డబ్బుల విషయమై భార్య దీపాలి చౌహాన్ తో గొడవపడ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్రమంలో దీపాలి […]
జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కుషాయిగూడలోని ఏఎస్ రావు నగర్లో నివాసముంటున్న సంతోష్ చౌహాన్.. స్థానిక వ్యాపారి పరమేశ్ పాటిల్ దగ్గర పనిచేస్తున్నాడు. అయితే గత రాత్రి జీతం డబ్బుల విషయమై భార్య దీపాలి చౌహాన్ తో గొడవపడ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్రమంలో దీపాలి తన భర్తపై కోపంతో కిచెన్ లో ఉన్న పట్టుకారును అతనిపై విసిరింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు. దీపాలి చనిపోయిందని నిర్ధారించుకున్న సంతోష్.. కొంతసేపటికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్ యజమాని పరమేష్ కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంతోష్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ చౌహాన్ ను అరెస్ట్ చేశారు.