జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!

జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కుషాయిగూడ‌లోని ఏఎస్​ రావు నగర్​లో నివాస‌ముంటున్న సంతోష్​ చౌహాన్.. స్థానిక వ్యాపారి ప‌ర‌మేశ్ పాటిల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడు. అయితే గ‌త రాత్రి జీతం డ‌బ్బుల విష‌య‌మై భార్య దీపాలి చౌహాన్​ తో గొడ‌వ‌ప‌డ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్ర‌మంలో దీపాలి […]

జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!
Follow us

|

Updated on: May 22, 2020 | 8:14 PM

జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కుషాయిగూడ‌లోని ఏఎస్​ రావు నగర్​లో నివాస‌ముంటున్న సంతోష్​ చౌహాన్.. స్థానిక వ్యాపారి ప‌ర‌మేశ్ పాటిల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడు. అయితే గ‌త రాత్రి జీతం డ‌బ్బుల విష‌య‌మై భార్య దీపాలి చౌహాన్​ తో గొడ‌వ‌ప‌డ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్ర‌మంలో దీపాలి త‌న భర్త‌పై కోపంతో కిచెన్ లో ఉన్న పట్టుకారును అత‌నిపై విసిరింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్​ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు. దీపాలి చనిపోయిందని నిర్ధారించుకున్న సంతోష్.. కొంతసేపటికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు ఫోన్​ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్​ యజమాని పరమేష్​ కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంతోష్​ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ చౌహాన్ ను అరెస్ట్ చేశారు.