నాగేంద్రకు 14 రోజుల రిమాండ్
విజయవాడలో సంచలనం రేపిన దివ్య తేజస్విని హత్యకేసు ప్రధాన నిందితునికి జ్యూడిషియల్ రిమాండ్ విధించింది మెట్రోపాలిటన్ కోర్టు. దాంతో అతన్ని రాజమండ్రి జైలుకు తరలించేందుకు పోలసులు ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా అతనికి...
Fourteen days remand for Nagendra: దివ్య తేజస్విని హత్య కేసులో ప్రధాన నిందితుడు నాగేంద్రకు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు మొదటి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్. దివ్య తేజస్విని హత్యకేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎస్. కమలాకర్ రెడ్డి నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని రాజమండ్రి జైలుకు పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దివ్య తేజస్వినిని దారుణంగా హత్య చేసిన అనంతరం తాను ఆత్మహత్యకు ప్రయత్నించడంతో నిందితుడు నాగేంద్రకు గాయాలైన విషయం తెలిసిందే. అతన్ని గుంటూరు గవర్నమెంటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. గాయాల నుంచి కోలుకున్న నాగేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే.. కోర్టులో హాజరు పరచడానికి ముందు ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిలో నాగేంద్రకు వైద్య పరీక్షలు చేయించారు.
నాగేంద్రకు బ్లడ్ ప్రెషర్, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వాటితోపాటు కోవిడ్ పరీక్ష చేయించ తలపెట్టారు. అందుకోసం నాగేంద్రను మచిలీపట్టణం సబ్ జైలుకు తరలించారు. అక్కడ అతనికి కోవిడ్ పరీక్ష నిర్వహించిన అనంతరం నెగెటివ్గా తేలితే రాజమండ్రి జైలుకు తరలిస్తారు. పాజిటివ్గా తేలినప్పటికీ రాజమండ్రి జైలు కానీ, బందరు జైలులోగానీ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి నిందితున్ని తరలిస్తారు.
ALSO READ: కేంద్రం ఒక్క పైసా ఇవ్వలే.. మండిపడ్డ కేసీఆర్
ALSO READ: బీహార్లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్
ALSO READ: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్తో చెక్
ALSO READ: జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస
ALSO READ: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్తో చెక్