బైక్లో మంటలు.. శానిటైజర్ వల్లేనా..!
రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో పార్క్ చేసిన ఓ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో జనం భయంతో పరుగులు తీశారు.
రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో పార్క్ చేసిన ఓ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో జనం భయంతో పరుగులు తీశారు. స్థానికుల సహకారంతో మంటలు ఆర్పివేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్ ముందు భాగంలోని కవర్లో శానిటైజర్ పెట్టడం వలనే మంటలు వచ్చినట్లు వాహనాదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే శానిటైజర్తో పాటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుందని ఫైర్ అధికారులు చెబుతున్నారు. కాగా కరోనా నేపథ్యంలో శానిటైజర్ వాడకం పెరుగుతోంది. అయితే దానికి మండే స్వభావం ఉండటంతో.. పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Read This Story Also: ఆ హీరోతో వన్స్మోర్ అంటోన్న కీర్తి..!