Naga Chaitanya- Sobhita: మళ్లీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య- శోభితల ఎంగేజ్‌మెంట్‌పై ఏమన్నారంటే?

|

Aug 08, 2024 | 8:27 PM

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ నిశ్చితార్థం జరిగి కొన్ని గంటలు కూడా గడవలేదు? అప్పుడే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బాంబు పేల్చారు.

Naga Chaitanya- Sobhita: మళ్లీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య- శోభితల ఎంగేజ్‌మెంట్‌పై ఏమన్నారంటే?
Naga Chaitanya, Sobhita Dhulipala, Venu Swamy
Follow us on

గత కొన్నినెలలుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ ఉంగరాలు మార్చుకున్నారు టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల. గురువారం (ఆగస్టు 08) ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అక్కినేని నాగార్జున చైతన్య-శోభిత ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ నిశ్చితార్థం జరిగి కొన్ని గంటలు కూడా గడవలేదు? అప్పుడే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బాంబు పేల్చారు. ఈ ప్రేమ పక్షుల గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ‘నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం వేణు స్వామి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంట గురించి గురూజీ ఏం బాంబు పేల్చుతాడోనని కామెంట్స్ చేస్తున్నారు. ‘కొత్త జంటను అప్పుడే ఎందుకు టార్గెట్ చేశారు స్వామీజీ’ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తానికి వేణు స్వామి పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి ఇన్ స్టా స్టోరీస్ పోస్ట్..

Venu Swamy Post

ఈ సంగతి పక్కన పెడితే వేణు స్వామి ఇంత ఫేమస్ కావడానికి ఒక రకంగా నాగ చైతన్య, సమంతలే కారణం. వీరిద్దరూ ఆదర్శ దంపతులుగా మెలుగుతారని అందరూ అనుకుంటున్న తరుణంలో విడాకులు తీసుకుంటారని మొదట చెప్పింది ఈ స్వామీజీయే. ఆ తర్వాత అది నిజం కావడంతో వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జాతకాలు, జ్యోతిష్యాలు ఏవీ నిజం కావట్లేదు. దీంతో స్వామీజీ బాగా ట్రోల్ అవుతున్నారు.

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.