Boney Kapoor : నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్ రానివ్వను.. ఆమె జీవితం అలాగే ఉండాలి.. బోనీ కపూర్ వ్యాఖ్యలు..

|

Apr 04, 2024 | 2:19 PM

ఆమె బయోపిక్ వస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆమె భర్త బోనీ కపూర్ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ.. తన భార్య చాలా ప్రైవేట్ వ్యక్తి అని.. ఆమె జీవితంలో జరిగే విషయాలను ఎప్పుడూ బయటకు చెప్పలేదని.. ఎప్పటికీ ఆమె జీవితంలో అలా ప్రైవేట్ గానే ఉండాలని అన్నారు. తాను బతికున్నంతవరకు శ్రీదేవి బయోపిక్ రానివ్వను అని అన్నారు.

Boney Kapoor : నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్ రానివ్వను.. ఆమె జీవితం అలాగే ఉండాలి.. బోనీ కపూర్ వ్యాఖ్యలు..
Sridevi, Boney Kapoor
Follow us on

భారతీయ సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్‏గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి మరణం ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె బయోపిక్ వస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆమె భర్త బోనీ కపూర్ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ.. తన భార్య చాలా ప్రైవేట్ వ్యక్తి అని.. ఆమె జీవితంలో జరిగే విషయాలను ఎప్పుడూ బయటకు చెప్పలేదని.. ఎప్పటికీ ఆమె జీవితంలో అలా ప్రైవేట్ గానే ఉండాలని అన్నారు. తాను బతికున్నంతవరకు శ్రీదేవి బయోపిక్ రానివ్వను అని అన్నారు.

ఇటీవల డీఎన్ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. “శ్రీదేవి చాలా ప్రైవేట్ వ్యక్తి. ఆమె జీవితంలో జరిగే విషయాలను ఇతరులతో పంచుకోదు. ఆమె జీవితం ప్రైవేట్‌గా ఉండాలి. ఆమె బయోపిక్ తెరకెక్కిస్తాను అంటే నేను అంగీకరించను. నేను జీవించి ఉన్నంతవరకు బయోపిక్ రానివ్వను ” అని అన్నారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా బయోపిక్ తీయడం అసాధ్యం. కాబట్టి శ్రీదేవి బయోపిక్ పెద్ద తెరపైకి రావడం అనుమానమే. అయితే శ్రీదేవి బయోపిక్ వెండితెరపైకి రావడం కంటే. పుస్తకంగా రాబోతుంది. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్. ఇందుకు ఆమె కుటుంబసభ్యుల పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీదేవి కంటే ముందు బోనీ కపూర్ కు మోనా శౌరీతో వివాహమైంది. 1983లో వీరి వివాహం జరగ్గా వీరికి అర్జున్ కపూర్, అన్షులా జన్మించారు. 1996లో శ్రీదేవితో వివాహం జరిగిన తర్వాత మోనాతో విడాకులు తీసుకున్నారు. శ్రీదేవితో పెళ్లి జరిగిన తర్వాత చాలా సంవత్సరాలపాటు అర్జున్ కపూర్ తన తండ్రి బోనీ కపూర్ తో మాట్లాడలేదు. కానీ శ్రేదేవి మరణం తర్వాత తన తండ్రితో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రస్తుతం అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.