Ram Charan: ‘చిరుత’ టికెట్స్ దొరక్కపోతే.. పిఠాపురం వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే?

|

Jul 28, 2024 | 4:37 PM

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్ఛాడు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. చిరుత రిలీజ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన పండగ వాతావరణం కనిపించింది. చిరంజీవి కొడుకు ఎలా ఉన్నాడో, తెరపై ఎలా నటించాడో తెలుసుకునేందుకు మెగా అభిమానులతో పాటు సాధారణ జనాలు చిరుత సినిమా థియేటర్లకు పరుగులు పెట్టారు

Ram Charan: చిరుత టికెట్స్ దొరక్కపోతే.. పిఠాపురం వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే?
Chirutha Movie
Follow us on

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్ఛాడు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. చిరుత రిలీజ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన పండగ వాతావరణం కనిపించింది. చిరంజీవి కొడుకు ఎలా ఉన్నాడో, తెరపై ఎలా నటించాడో తెలుసుకునేందుకు మెగా అభిమానులతో పాటు సాధారణ జనాలు చిరుత సినిమా థియేటర్లకు పరుగులు పెట్టారు. చాలామంది చిరుత బెనిఫిట్ షో కోసం అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర పడిగాపులు కాశారు. ఇందులో సామాన్యులతో పాటు ఒక టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు. అతను మరెవరో కాదు టాలీవుడ్‌ స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు. గతేడాది హిడింబ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు శివం భజే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోన్న అశ్విన్ .. చిరుత సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను తనతో పంచుకున్నాడు. అలాగే పిఠాపురంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘ రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాకు టికెట్స్ దొరక్కపోతే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లి పొద్దున్నే 4.30కి బెనిఫిట్ షో చూసాను. ఒకప్పుడు కాకినాడ దగ్గర పిఠాపురం అనే వాళ్లు. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది.’ అని చెప్పుకొచ్చాడు అశ్విన్ బాబు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగాభిమానులు తెగసంబరపడిపోతున్నారు. మెగా ఫ్యామిలీ రేంజ్ అలాంటిది మరి అంటూ క్రేజీగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిఠాపురం పై అశ్విన్ బాబు కామెంట్స్.. వీడియో ఇదిగో..

కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అశ్విన్ బాబు శివం భజే సినిమా ఆగస్టు 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో దివంగనా సూర్య వంశీ హీరోయిన్ గా నటించింది. హైపర్ ది, అర్భాజ్ ఖాన్, బ్రహ్మాజీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.