‘పారాసైట్’ వివాదం.. జక్కన్న క్లారిటీ..!

ఈ ఏడాది నాలుగు ఆస్కార్ అవార్డులను సాధించిన కొరియన్ చిత్రం పారాసైట్‌ బోరింగ్‌గా అనిపించిందని దర్శకధీరుడు రాజమౌళి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

'పారాసైట్' వివాదం.. జక్కన్న క్లారిటీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 1:42 PM

ఈ ఏడాది నాలుగు ఆస్కార్ అవార్డులను సాధించిన కొరియన్ చిత్రం పారాసైట్‌ బోరింగ్‌గా అనిపించిందని దర్శకధీరుడు రాజమౌళి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూస్తూ తాను చాలాసార్లు నిద్రపోయానని కూడా ఆయన అన్నారు. అంతేకాదు ఆ తరువాత తన భార్య కథ చెప్పినా తనకు పెద్దగా నచ్చలేదని, అయినా తనకు నచ్చనంత మాత్రాన అది గొప్ప సినిమా కాకుండా పోదని కూడా వివరణ ఇచ్చారు. అయితే ఈ కామెంట్లపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.

ఇక ఈ కామెంట్లపై మిఠాయి మూవీ దర్శకుడు ప్రశాంత్ కుమార్‌ స్పందించారు. మీ మూవీల్లో చాలా కాపీలు ఉన్నాయి. బాహుబలి గురించి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు నేనెక్కడా వినలేదు.. చూడలేదు అంటూ పెద్ద లేఖనే రాశారు. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలపై మరోసారి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. పారాసైట్ నాకు నచ్చకపోవడమన్నది వ్యక్తిగత అభిప్రాయం. గతంలో కూడా చాలా ఆస్కార్ సినిమాలు నాకు నచ్చనివి ఉన్నాయి. చాలా నచ్చినవీ ఉన్నాయి అని జక్కన్న వివరించారు. ఇక అకాడమీ జ్యూరీ ప్రమాణాలపై తనకు పూర్తిగా నాలెడ్జ్ లేదని ఆయన వివరించారు.

Read This Story Also: ఆఫీస్‌కి పిలుస్తారనుకున్నా కానీ.. : జగన్‌పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు