Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా కీర్తి కిరిటంలో మరో కలికితురాయి.. తొలి భారతీయ నటుడిగా షారుఖ్‌కు అరుదైన గౌరవం

|

Jul 25, 2024 | 6:48 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫ్రాన్స్‌లో కూడా షారుఖ్ ను ఇష్టపడే వారు ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణే కింగ్ ఖాన్ కు దక్కిన ప్రత్యేక గౌరవం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో కొత్త బంగారు నాణెం విడుదలైంది.

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా కీర్తి కిరిటంలో మరో కలికితురాయి.. తొలి భారతీయ నటుడిగా షారుఖ్‌కు అరుదైన గౌరవం
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫ్రాన్స్‌లో కూడా షారుఖ్ ను ఇష్టపడే వారు ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణే కింగ్ ఖాన్ కు దక్కిన ప్రత్యేక గౌరవం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో కొత్త బంగారు నాణెం విడుదలైంది. దానిపై షారుక్ ఖాన్ చిత్రం , పేరు ఉండడం విశేషం . ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. షారూఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అంతే కాకుండా ఇప్పుడు షారుఖ్ ఖాన్ గౌరవార్థం బంగారు నాణెం కూడా విడుదల చేశారు. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్ ఖాన్. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు కూడా షారూఖ్ ఖాన్ కావడం విశేషం. భారతీయ సినిమా ఇండస్ట్రీకి సుమారు మూడు దశాబ్ధాలకు పైగా హీరోగా సేవలు అందిస్తున్నాడు షారుఖ్. తన నటనా ప్రతిభకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. కింగ్ ఖాన్ ను చూసేందుకు విదేశీయులు సైతం ముంబైలోని అతని నివాసం ఎదుటకు వస్తుంటారు.

ఇదిలా ఉంటే 2023కి ముందు కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. కానీ గోడకు కొట్టిన బంతిలా ‘జవాన్’, ‘పఠాన్’, ‘డంకీ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు కింగ్ ఖాన్. ఇందులో రెండు సినిమాలు ఏకంగా 1000 కోట్ల వసూళ్లను సాధించాయి. ఇప్పుడు షారుఖ్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అతని పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ కూడా చిత్ర పరిశ్రమలో బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా షారుఖ్ ఇప్పుడు కింగ్ అనే మూవీలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో అతని కూతురు సుహానా ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించనుందని టాక్. ఈ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ సినిమాలోనే అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.